AP: టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాలని అన్నారు. లేకపోతే వెంకటేశ్వరస్వామే వారిని శిక్షిస్తారని తెలిపారు. ‘కూటమి ప్రభుత్వంలో కల్తీ అని తేలినా.. మరో సంస్థ పేరుతో 4 ట్యాంకర్ల నెయ్యిని తీసుకొచ్చారు. నెయ్యిపై చర్చించాలని కోరితే ప్రభుత్వం తోకముడిచింది’ అని విమర్శించారు.