GNTR: పొన్నూరులో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆధ్వర్యంలో ‘ఈ-వేస్ట్’ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిబిసి రోడ్డు వద్ద ప్రతిజ్ఞ చేసిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ పొన్నూరు లక్ష్యంగా ప్రజలను చైతన్యపరచాలని సిబ్బందిని కోరారు.