KMM: వెంకటపాలెం గంజాయి స్మగ్లింగ్ కేసులో నిందితులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఏప్రిల్ 7న వెంకటపాలెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న 194 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, నేరం నిరూపితం కావడంతో శిక్ష విధించింది.