PLD: మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన పులిచింతల ముంపు బాధితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద రూ. 6 కోట్లు విడుదల చేయాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సీఎం చంద్రబాబును కోరారు. గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, గురజాల నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు.