TG: ఖమ్మం(D)లో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, MLA వాకిటి శ్రీహరి సహా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కార మార్గాలపై ఈ భేటీలో చర్చిస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.