KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేక RTC బస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీధర్ RTC RMను ఆదేశించారు. ఒంటిమిట్టలో జరిగిన సమీక్షలో ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ మాట్లాడారు. కడప రైల్వే స్టేషన్ నుంచి భక్తులకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. గత బ్రహ్మోత్సవాలకు 145 బస్సులు ఏర్పాటు చేసినట్లుగా RTC RM కలెక్టర్కు తెలిపారు.