సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం పోతుకుంట గ్రామంలో ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ బీజేపీ నేత హరీష్ బాబు పాల్గొని మహిళల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై వివరించారు. మహిళల ఆరోగ్యం కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగవేణి, కూటమి నాయకులు పాల్గొన్నారు.