KDP: విద్యార్థులు అన్నిటిలో ఉత్తమమైన శక్తిని కలిగి ఉండాలని, అప్పుడే అనుకున్న విజయాన్ని సాధించవచ్చని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు. గురువారం స్మార్ట్ ఇండియా హ్యకథాన్-2025లో భాగంగా విద్యార్థులు అభివృద్ధి చేసిన వివిధ విభాగాల అప్లికేషన్లు ప్రదర్శించారు. దాదాపు 106 టీమ్లు ప్రదర్శనలు చేయగా.. 50 ఉత్తమ టీమ్లుగా ఎంపిక చేశారు.