NTR: దేశీయ గోవుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాడి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గురువారం వత్సవాయి మండలం, కంభంపాడులోని చేకూరి రమేష్బాబుకు చెందిన సాయిశ్రీనివాస గోశాలను సందర్శించారు. దేశీ జాతి ఆవుల నుంచి వచ్చే A2 పాలు, వాటితో తయారు చేసే నెయ్యి, పెరుగు వంటి పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.