PPM: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని గిరిజన జేఏసీ నాయకులు గురువారం పాచిపెంట మండలం పెద్దవలసలో ధర్నాను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రాంతంలో జాబితాను గిరిజన సంక్షేమ శాఖలో పొందుపరచమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తెలుపుతామని వారు హెచ్చరించారు.