CTR: సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ కళాశాల ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 12 వరకు పొడగించినట్లు ప్రిన్సిపల్ జయసింహనాయుడు తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పలు వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు.