AKP: నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సామాజిక ప్రజావేదిక కార్యక్రమం గురువారం నిర్వహించారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన అభివృద్ధి పనులపై సమీక్షిస్తూ అవి సక్రమంగా జరిగాయా అనే అంశంపై సామాజిక తనిఖీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీడీ పూర్ణిమాదేవి, ఎంపీడీవో శ్రీనివాస్, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.