కృష్ణా: ప్రసిద్ధ నాట్యకేంద్రంగా గుర్తింపు పొందిన కూచిపూడి గ్రామంను సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ డి.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయుడుతో కలిసి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.