AP: డిసెంబర్ కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300ల టికెట్లు ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. భక్తులు దళారులను నమ్మొద్దని, ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ లేదా యాప్లోనే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.