ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత జట్టును సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్కు కేవలం 45 బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సంజూ 27 బంతుల్లో 55 పరుగులు చేయగా, ఇషాన్ 18 బంతుల్లో 39 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం శివం దూబే క్రీజులోకి వచ్చాడు.