KMR: జిల్లా బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కార్, వైస్ ఛైర్మన్ భాగ్యలక్ష్మిలను గురువారం టీఎన్జీవో యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ ప్రాజెక్టు సెక్రటరీ విజయలక్ష్మి, తదితరులు పాలుగోన్నారు.