నెల్లూరు: ఇందుకూరుపేట మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశాన్ని ఈనెల ఆరవ తేదీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి నాగేంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రెవెన్యూ, తదితర విషయాలను చర్చించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు.