ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC)లో శుక్రవారం ప్రత్యేక మెగా వైద్య శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు హెచ్ఈఓ పవార్ రవీందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల పాటు చేపడుతున్న ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా RIMS ఆసుపత్రి వైద్యులు రానున్నారని పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణరావు హాజరవుతారన్నారు.