KNR: కరీంనగర్ నగునూరు వైద్యకళాశాలలో ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న నూకల శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ నిర్వహించిన IOACON- 2025 సదస్సులో కన్సల్టెంట్ విభాగంలో బెస్ట్ పేపర్ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిమ యాజమాన్యం, ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు.