నెల్లూరు: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేసిన విజ్ఞప్తులకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న కోవూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.