AKP: గొలుగొండ మండలం పరిధిలోని లింగంపేట సమీపంలోని రామచంద్రపాలెం జంక్షన్ వద్ద ఇవాళ పెను ప్రమాదం తప్పింది. నర్సీపట్నం నుంచి కృష్ణదేవిపేట వైపు వెళ్తున్న కారు ఈ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తిని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న పెంటకుప్ప వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.