చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్లో ఆరో ర్యాంకర్, థాయ్ ప్లేయర్ చోచువాంగ్పై సింధు 21-15, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సింధు ఆరంభం నుంచీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించింది.