MNCL: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులు దృష్టి పెట్టాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జన్నారం మండలంలోని చాలా గ్రామాలలో రైతులు ఇంకా సాంప్రదాయ పంటలనే పండిస్తున్నారని అన్నారు. అయితే ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగం ఆధారంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేస్తే మేలు జరుగుతుందన్నారు.