సత్యసాయి: హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో మేళాపురం, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి రోడ్డు విస్తరణపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, కమిషనర్ మల్లికార్జున నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో 80 అడుగుల రోడ్డు విస్తరణ ప్రతిపాదనను వివరించారు. పట్టణ అభివృద్ధికి, భావితరాల భవిష్యత్తుకు సహకరించాలని కోరారు.