E.G: కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ సర్పంచ్ అన్నదేవుల చంటి ఆధ్వర్యంలో అక్కడి స్మశానవాటిక అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అందరిని ఆకట్టుకుంటోంది. తాజాగా స్మశానవాటికలో కాటికాపరి విగ్రహాన్ని చంటి తన సొంత నిధులతో అత్యంత సుందరంగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని గురువారం ఘనంగా ఆవిష్కరించనున్నారు.