BPT: బాపట్ల జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది మొత్తం 19,032 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం నుంచి 9,744 మంది, రెండో సంవత్సరం నుండి 9,288 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.