MDK: మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మాసాయిపేట మండలం పోతాన్ పల్లి గ్రామానికి చెందిన బర్రె చంద్రయ్య కుమారుడైన బర్రె విజయ్(25) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురైయ్యాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై చేగుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.