RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్లో సయ్యద్ సద్దాం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ సమతా వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామరస్యం పెంపొందించడంలో ఇఫ్తార్ విందులు ముఖ్యపాత్ర వహిస్తాయని, రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.