KRNL: వీఆర్ఏలకు పే స్కేల్ వేతనాలను అమలు చేయాలని బుధవారం పెద్దకడబూరులోని తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి వీఆర్ఏలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు నరసింహులు, నాగరాజు, భీమన్న, ఉసేని మాట్లాడుతూ.. వీఆర్ఏలు ఏళ్ల తరబడి చాలీ చాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలన్నారు.