సత్యసాయి: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని హిందూపురంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ టీఎన్ దీపిక సూచనల మేరకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షేక్ ఆసిఫుల్లా ఈ కార్యక్రమం నిర్వహించారు. పండుగ వేళ కార్మికులకు అండగా నిలవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజ సేవలో భాగస్వాములవుతున్న కార్మికుల కృషిని కొనియాడారు.