కృష్ణా: రైతుల బాధలు అర్థం చేసుకొని సకాలంలో యూరియా సరఫరా చేయాలని పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయంలో రైతులకు సకాలంలో యూరియా అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనిల్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో వైఫల్యం చెందిందన్నారు.