ఆసియా కప్కు ముందు టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల కేరళలో జరిగిన టీ20 టోర్నీలో అర్జించిన జీతాన్ని సహచరులు, సహాయక బృందానికి విరాళంగా ఇచ్చాడు. ఈ టోర్నీ ద్వారా సంజూ రూ.26.8 లక్షలు పొందాడు. కాగా, ఈ టోర్నీ వేలంలో సంజూ రూ.50 లక్షలకు అమ్ముడుపోయాడు. అయితే, కొచ్చితో తనకున్న అనుబంధంతో సగం డబ్బుకే ఆడేందుకు ఒప్పుకున్నాడు.