ASF: జిల్లా కలెక్టరేట్లో బుధవారం దివ్యాంగుల హక్కులపై సమీక్ష సమావేశం జరిగింది. మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్ హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేయూత పింఛన్ కేంద్రాల్లో తాగునీరు,సదరం శిబిరాల్లో వీల్చైర్లు ఏర్పాటు చేస్తామన్నారు.