SDPT: మక్కలకు కనీస మద్దతు ధర (MSP) చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని సాగు చేసిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని విమర్శించారు. సకాలంలో యూరియా ఇవ్వడంలో విఫలమైన రేవంత్ సర్కార్, పంట కోత దశకు వచ్చినా పెట్టుబడి సాయం అందించలేకపోవడం దారుణమని మండిపడ్డారు.