TPT: నగరంలోని అన్నా క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాలను వృధా చేయకుండా కావలసినంత భోజనం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య ప్రజలను కోరారు. నగరంలోని న్యూ బాలాజి కాలనిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను ఇవాళ కమిషనర్ పరిశీలించారు. ఆన్లైన్ ద్వారా ప్రజలకు ఇస్తున్న టోకెన్లు పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.