BPT: అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓలేరు గ్రామానికి చెందిన బలిజేపల్లి రవీంద్ర బాబుకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అండగా నిలిచారు. బుధవారం రవీంద్ర బాబుకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 3.25 లక్షల LOC పత్రాన్ని ఆయన అందజేశారు. ఈ ఆర్థిక సాయాన్ని సరైన రీతిలో వినియోగించుకుని త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.