నెల్లూరు 53 డివిజన్ పరిధిలోని కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిద్రమత్తులో భారీ ట్యాంకర్ ఇంట్లో దూసుకుని వెళ్లి మౌలాలి మస్తానమ్మకు గాయాలైన విషయం తెలిసిందే. వారికి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని చెప్పారు. పేదవారు కావడంతో వైద్య ఖర్చులకు కష్టతరంగా ఉందని పాలకులు స్పందించి వారికి అండగా నిలవాలని గ్రామస్థులు కోరుతున్నారు.