PPM: ఎయిడ్స్, హెచ్.ఐ.వి అవగాహనలో భాగంగా ఈ నెల 9వ తేదీన రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రోసి, ఎయిడ్స్, హెచ్.ఐ.వి, టిబి నియంత్రణ అధికారి డా.ఎం వినోద్ కుమార్ తెలిపారు. ఈమేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. 9వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి రన్ ప్రారంభం అవుతుందని తెలిపారు.