కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరులో రైతు సేవా కేంద్రంలో మినుములు, పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మార్క్ ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్ ప్రారంభించారు. ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, వైస్ ఎంపీపీ రాంబాబు పాల్గొన్నారు.