ASR: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలోని పెదలబుడు పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నుంచి సమ్మెకు దిగారు. గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. సమ్మె కారణంగా పట్టణంలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో అరకులోయ అందాలు మసకబారే పరిస్థితి నెలకొంది.