VSP: గాజువాక నియోజకవర్గంలో చెరువులు, పార్కుల సుందరీకరణకు త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు తెలిపారు. బుధవారం జీవీఎంసీ 86వ వార్డులోని రావుల చెరువు, లక్కరాజుపాలెం చెరువు, రాజీవ్ నగర్, మాతృశ్రీ లేఅవుట్ పార్కులను పరిశీలించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో అభివృద్ధి చేపడతామన్నారు.