ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 70 రోడ్ల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.58.05 కోట్ల నిధులు మంజూరు చేసింది. అధికారులు పంపిన అంచనాల మేరకు ఆర్థిక అనుమతులు లభించాయి. ఇందులో అనంతపురం డివిజన్ పరిధిలో 31 రోడ్లు, ధర్మవరం డివిజన్ పరిధిలో 39 రోడ్లకు మరమ్మతులు చేయనున్నారు. ముఖ్యంగా గుంతలమయంగా మారిన గుత్తి-పత్తికొండ రహదారికి మోక్షం లభించనుంది.