MDK: భావి భారత పౌరులైన విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి పిలుపునిచ్చారు. బుధవారం అక్కన్నపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.