కోనసీమ: మామిడికుదురు మండలానికి చెందిన ఓ గ్రామంలో మానసిక దివ్యాంగురాలైన 15 ఏళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగుచూసింది. నిందితుడు జరిగిన నేరాన్ని బయటకు రానీయకుండా పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లలేదని తెలిసింది.