AP: కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మరువక ముందే వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లే ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి ముళ్ల కంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.