PLD: గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురజాల మండలం తేలుకుట్ల బీసీ నాయకుడు బత్తుల ఏడుకొండలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం పరామర్శించారు. దాడిలో గాయపడిన ఏడుకొండలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. “పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం, వైసీపీ దాడులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు” అని ఆయన ధైర్యం చెప్పారు.