PDPL: మంథని పట్టణ పరిధిలోని గాడుదుల గండి గుట్ట మలుపు వద్ద ఇసుక లారీ బోల్తా పడింది. కొయ్యూరు వైపు నుంచి మంథని వైపు వచ్చే లారీ గుట్ట దిగేటప్పుడు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, లారీ డ్రైవర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.