మన్యం: సికెడి (క్రానికల్ కిడ్నీ డిసీజ్)పై వైద్య సిబ్బంది నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న ఓ పత్రికలో వచ్చిన ‘ఏ తలుపు తట్టిన మృత్యు ఘోషే’ వార్తకు ఆయన పై విధంగా స్పందించారు. వార్త తెలిసిన వెంటనే జియ్యమ్మవలస ఆరోగ్య వైద్యాధికారిని విచారణ చేసి రిపోర్ట్ పంపాలని ఆదేశించారు.