NLG: మాడ్గులపల్లి మండలం ఆగా మోత్కూర్ గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సీపీఎం శాఖ కార్యదర్శి, 7వ వార్డు సభ్యులు బంటు నాగరాజు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్నారని, దీనిపై పంచాయతీ ఏఈని అడగగా తమకు సమాచారం లేదని తెలిపారని అన్నారు.