పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అందిస్తున్న సేవలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. గడచిన నెలలో 22,447 మంది ఔట్ పేషెంట్లు, 1872 మంది ఇన్ పేషెంట్లు వివిధ విభాగాలలో సేవలు పొందారని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రభుత్వాసుపత్రిలో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు.